బ్రహ్మోస్ మాజీ ఉద్యోగికి జీవిత ఖైదు

బ్రహ్మోస్ మాజీ ఉద్యోగికి జీవిత ఖైదు
  • పాకిస్తాన్​ ఐఎస్​ఐకి రహస్యాలు చేరవేసిన నిశాంత్​ అగర్వాల్​
  • యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నాగ్​పూర్​ కోర్టు

నాగ్​పూర్​: గూఢచర్యం కేసులో బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఇంజినీర్​ నిశాంత్ అగర్వాల్​కు  జీవిత ఖైదు పడింది. పాకిస్తాన్​ నిఘా సంస్థ ఐఎస్​ఐకి రహస్యాలు చేరవేసినందుకు అఫీషియల్​ సీక్రెట్​ యాక్ట్​ కింద నాగ్​పూర్ డిస్ట్రిక్ట్​​ జిల్లా కోర్టు సోమవారం అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. దీనికింద నిశాంత్​ 14 ఏండ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

అలాగే, అతడిపై కోర్టు రూ. 3వేల జరిమానా కూడా విధించింది.  నిశాంత్​ అగర్వాల్​ నాగ్​పూర్​లోని బ్రహ్మోస్​ సంస్థకు చెందిన మిస్సైల్​ కేంద్రంలోని టెక్నికల్​ రీసెర్చ్​ సెక్షన్​లో పనిచేసేవాడు. అక్కడ నాలుగేండ్లు విధులు నిర్వర్తించాడు. ఈ సమయంలో బ్రహ్మోస్​కు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని  పాకిస్తాన్​​ఐఎస్ఐకి లీక్​ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

దీంతో 2018లో ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్‌‌‌‌, ఉగ్రవాద నిరోధక బృందాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌‌‌‌లో అరెస్టయ్యాడు. అనంతరం అతడిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం తాజాగా నాగ్‌‌‌‌పుర్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.